IND vs ENG 3rd Test : వైజాగ్ టెస్టు విజయంతో జోరుమీదున్న టీమిండియా(Team India) రాజ్కోట్లోనూ రఫ్ఫాడిస్తోంది. తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) శతకాలతో భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్లో తడబడింది. ఓవర్నైట్ స్కోర్ 326/5తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 388 రన్స్ కొట్టింది.
రెండో రోజు తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే భారత్కు షాక్ తగిలింది. కుల్దీప్()ను అండర్సన్ బోల్తా కొట్టించగా.. లోకల్ బాయ్ జడ్డూను రిటర్న్ క్యాచ్తో రూట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత అశ్విన్(25 నాటౌట్) అరంగేట్రం కుర్రాడు ధ్రువ్ జురెల్(31 నాటౌట్) బాధ్యతగా ఆడారు. ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించారు.
Dhruv Jurel 🤝 R Ashwin
5⃣0⃣-run stand ✅
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/jN2DK7hLQw
— BCCI (@BCCI) February 16, 2024
రాజ్కోట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10), శుభ్మన్ గిల్(0), రజత్ పాటిదార్(5)లను త్వరగా కోల్పోయింది. 33 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112)లు సమయోచితంగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేస్తూ సెంచరీ కొట్టారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించారు.
In No Time!
5⃣0⃣ on Test debut for Sarfaraz Khan 👏 👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/F5yTN44efL
— BCCI (@BCCI) February 15, 2024
మరోవైపు అరంగేట్రంలోనే రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్(62) అర్ధ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నైట్వాచ్మన్ కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడాడు. దాంతో రోహిత్ సేన మొదటిరోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 326 రన్స్ చేసింది.