Asia Team Championships : మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ (Badminton Asia Team Championships)లో భారత మహిళా షట్లర్లు అద్భుతం చేశారు. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్(Hong Kong)ను చిత్తు చేసిన షట్లర్లు సెమీఫైనల్లోనూ రఫ్ఫాడించారు. దాంతో, ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్లో అడగు పెట్టి చరిత్ర సృష్టించారు. దాంతో, ఈసారి కనీసం వెండి పతకం రావడం పక్కా.
శనివారం జరిగిన సెమీఫైనల్లో యువకెరటం అష్మిత చలిహ(Ashimita Chaliha), అన్మోల్ ఖార్బ్(Anmol Kharb)లు అదరగొట్టారు. 3-2తో జపాన్ క్రీడాకారుణులపై గెలుపొందారు. దాంతో, ఆసియా టీమ్ చాంపియన్షిప్స్లో భారత జట్టు తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది.
HISTORY SCRIPTED 🤩🤩
First-ever final for #TeamIndia at #BATC 🥳
Courtesy: 17 year old Anmol Kharb@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BATC2024#IndiaontheRise#Badminton pic.twitter.com/2LbQSmzqWO
— BAI Media (@BAI_Media) February 17, 2024
సింగిల్స్లో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu) సింగిల్స్లో ఓటమిపాలైంది. జపాన్ ప్లేయర్ అయ ఒహొరి(Aya Ohorri)పై మెరుగైన రికార్డు ఉన్నసింధు 13-21, 20-22తో మ్యాచ్ చేజార్చుకుంది. కానీ, డబుల్స్లో గాయత్రి గోపిచంద్, జోలి ట్రెస్సాలు గెలుపొందడంతో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది.
అద్భుత విజయంతో తొలి పతకం ఖరారు చేశారు. గ్రూప్ దశలో బలమైన చైనా కోటను బద్ధలు కొట్టిన మన షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో హాంకాంగ్ను 3-0తో చిత్తుగా ఓడించారు. ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu), అష్మిత చలిహ(Ashmita Chaliha), డబుల్స్ క్రీడాకారిణులు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టోలు హాకాంగ్ ప్లేయర్లను మట్టికరిపించారు.