పెద్దపెల్లి : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 చెల్లించాలని ,కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.1500 తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయాలన్నారు.
చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.