న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 2020లో తొలిసారి లాక్డౌన్ విధించిన సమయంలో.. ఆ వైరస్ వ్యాప్తికి కాంగ్రెస్ కారణమయ్యిందంటూ ప్రధాని మోదీ సోమవారం లోక్సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్తో పాటు మహారాష్ట్రలో శివసేన కూడా వలస కార్మికులను స్వంత ఇండ్లకు పంపించే ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే ఆ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. వలస కార్మికుల తరలింపుపై ప్రధాని మోదీ అన్ని అబద్ధాలు చెబుతున్నట్లు కేజ్రీ ఆరోపించారు. లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదు అని ఆయన అన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులుపడ్డ వారి పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరించాలని దేశం ఆకాంక్షిస్తోందని ఆమ్ ఆద్మీ చీఫ్ అన్నారు. హిందీలో ట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. ఫస్ట్ వేవ్ సమయంలో ముంబైలో కాంగ్రెస్ నేతలు వలస కూలీలకు టికెట్లు ఇచ్చి సొంతూళ్లకు వెళ్లగొట్టారని, దీంతో కరోనా వ్యాప్తి జరిగినట్లు మోదీ ఆరోపించారు.ఢిల్లీలో కూడా ప్రజలు ఊళ్లకు వెళ్లేందుకు బస్సులను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ప్రధాని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని మహారాష్ట్ర రెవన్యూ మంత్రి బాలాసాహబ్ థోరట్ ఆరోపించారు.
प्रधानमंत्री जी का ये बयान सरासर झूठ है। देश उम्मीद करता है कि जिन लोगों ने कोरोना काल की पीड़ा को सहा, जिन लोगों ने अपनों को खोया, प्रधानमंत्री जी उनके प्रति संवेदनशील होंगे। लोगों की पीड़ा पर राजनीति करना प्रधानमंत्री जी को शोभा नहीं देता। pic.twitter.com/Dd4NsRNGCY
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 7, 2022