జమ్మికుంట : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందగా మద్ధతు తెలపడం హర్షణీయమని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామ శ్రీవాయిపుత్ర నాయిబ్రాహ్మణ సహకార సంఘం నాయకులు సభ్యులు మంగళవారం మద్ధతు పత్రాన్ని ఎమ్మెల్యే రమేశ్కు అందజేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కుల వృత్తులకు చేయూత ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనాని ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు నాయి బ్రాహ్మణులు మద్ధతె తెలపడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్పార్టీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాయిపుత్ర నాయిబ్రాహ్మణ సహకార సంఘం అధ్యక్షుడు బిజిగిరి మల్లేశం, గౌరవ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షుడు సుధాకర్, కోశాధికారి కృష్ణస్వామి, నాయకులు తిరుపతి, సంపత్, సమ్మయ్య, పదానందం, వెంకన్న, లింగామూర్తి, సతీశ్, రాజులతోపాటు తదితరులు ఉన్నారు.