అమరావతి : పవన్ కల్యాణ్ మాటలు జగన్ మీద విషం చిమ్మే ప్రయత్నమని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమా పరిశ్రమ గురించి పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 నడుస్తున్నాయని, మూడు రోజులుగా 510 థియేటర్లలో లవ్స్టోరీ సినిమా ఆడుతోందని చెప్పారు. ఏపీలో మొదటి రోజు నిర్మాతకి వచ్చింది రూ.3.81 కోట్లు, రెండో రోజు రూ.2.80 కోట్ల షేర్ వచ్చిందని తెలిపారు. జగన్పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు పేలారంటూ విమర్శించారు. దీనిపై నిర్మాత మాట్లాడాలని నాని డిమాండ్ చేశారు.
యుద్ధవీరుడు, పోరాట యోధుడు పీకే వాస్తవాలు గ్రహించాలంటూ హితవు పలికారు. సీఎం జగన్ సినీ పరిశ్రమను ఏం ఇబ్బంది పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై మీడియా తప్పేంటని ప్రశ్నించారు. ‘రిపబ్లిక్ ఇండియా కనుక.. ఏమి మాట్లాడినా చెల్లుతుందని.. నా కోసం బందరు వచ్చి తిట్టావు.. నీ మనసు నిండా నేను ఉన్నానంటూ’ వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోందని.. దమ్ముంటే అమిత్ షాను అడగాలని.. మీకు టాక్స్లు, జీఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ పవన్కు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇండస్ట్రీకి లాభమా.. నష్టమా..?
పవన్ కళ్యాణ్ స్పీచ్ | ఇండస్ట్రీలో వేడి రాజుకుంది.. నాని ముందుకొచ్చాడు..
Nagarjuna: హౌస్లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్మేట్స్కి నాగ్ ప్రశ్న