Pawan kalyan | పవన్ కళ్యాణ్ ఆవేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆయన ఆవేశం లాభం చేస్తుంది.. మరికొన్నిసార్లు విమర్శల పాలు చేస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత ఆయన ఒక పవర్ ఫుల్ స్పీచ్ తో అందరిలో వేడి రాజేశారు. ఏపీలో చాలా రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి పడటం లేదు. వాళ్లిద్దరి మధ్య చర్చలు కూడా జరగడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ కావడం లేదు.. పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఈ విషయంపై మాట్లాడటానికి సినీ పెద్దలు కూడా తటపటాయిస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీ ప్రతికూలంగా మారుతున్నాయి అంటూ ఇప్పటికే కొందరు బాహాటంగా విమర్శించారు. అయితే దానిని బలంగా చెప్పడంలో విఫలం అవుతున్నారు సినీ పెద్దలు.
చిరంజీవి నుంచి మొదలు పెట్టి ఎంతో మంది సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా అది సఫలీకృతం కావడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మన సొంత డబ్బు పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వానికి భయపడాలి.. అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే చాలామంది చూస్తూ కూర్చున్నారు. ఈ ప్రశ్నలు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మిగిలిన సినీ పెద్దలు వేయలేకపోతున్నారు అంటూ విశ్లేషకుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇబ్బంది పెడుతున్నారు అంటూ కొందరు జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు చేశారు. అయినా కూడా ఎందుకు దీన్ని భరిస్తున్నారు.. టికెట్ విక్రయం ప్రభుత్వం చేతిలోకి వెళ్తే అది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టం కలిగిస్తుంది కదా.. ఈ విషయం గురించి ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు అంటూ రిపబ్లిక్ డే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. మన ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం ఏంటి అంటూ పవన్ ప్రశ్నలు సంధించాడు. ఈయన స్పీచ్ ఇండస్ట్రీకి ప్లస్ అవుతుందా మైనస్ కానుందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఎందుకంటే మండుతున్న నిప్పుపై మరింత పెట్రోల్ పోశాడు పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకులకు తనతో సమస్య ఉంటే నేరుగా తేల్చుకుందాం కానీ.. సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టండి అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్పాడు. మరి దీనిపై ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిరంజీవి సహా చాలామంది సినీ పెద్దలను పేరు పెట్టి మరి విమర్శించాడు పవన్ కళ్యాణ్. వైసీపీ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు లాంటి వాళ్లను జగన్తో వెళ్లి మాట్లాడండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. లేకపోతే రేపటి రోజు మీ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రభుత్వం చేస్తాడు అంటూ హెచ్చరించాడు. మీ దాకా వచ్చే వరకు తెచ్చుకోకండి మోహన్ బాబు గారు.. మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తులు అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు.
మీరు ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదు.. మనం కష్టపడి సంపాదిస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది అని.. ఇప్పుడు కూడా ముందుకు రాకపోతే బానిసత్వం మరి ఎక్కువ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియక.. ఆసక్తిగా రాబోయే పరిస్థితులను గమనిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
Nagarjuna: హౌస్లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్మేట్స్కి నాగ్ ప్రశ్న
Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కుటుంబం ఇదే..!