హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందులలోని మినీ సెక్రటేరియట్లోని ఆర్వో ఆఫీస్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సీఎంతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు.
అంతకుముందు ఆయన స్థానిక సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు కుట్రలను ఎండగట్టిన జగన్.. పులివెందుల తన ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతలపై విమర్శలు సంధించారు.
Siddham Anna🔥 pic.twitter.com/QDTBHWtnot
— Satish Reddy (@ReddySatish4512) April 25, 2024