ముంబై: సుమారు 20 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంపీ మిలింద్ డియోరా (Milind Deora) తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోసం ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. రాజ్యసభ సభ్యుడైన మిలింద్ డియోరా ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఆయన చేరారు. 2004, 2009లో దక్షిణ ముంబై లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
కాగా, తాను లేదా తన తండ్రి మురళీ డియోరా దక్షిణ ముంబై లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని మిలింద్ డియోరా బుధవారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘20 ఏళ్లలో తొలిసారి నేను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 44 ఏళ్లలో తొలిసారి నా తండ్రి లేదా నేను దక్షిణ ముంబై నుంచి ఎన్నికల బరిలో ఉండటం లేదు’ అని పేర్కొన్నారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా తన సామర్థ్యానికి తగినట్లుగా ప్రాతినిధ్యం వహిస్తానని నియోజకవర్గం ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కోసం ప్రచారం చేస్తానని ఆయన వెల్లడించారు.
For the first time in 20 years, I won't be contesting in a Lok Sabha election. And, for the first time in 44 years, my father or I will not be on the ballot box in South Mumbai.
After four consecutive elections as a candidate, I am looking forward to… pic.twitter.com/FRLKYVo1A7
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) May 1, 2024