40 కాలనీల గుండా.. 2.3 కి.మీ పొడవు నాలా నిర్మాణం
రూ.17.80కోట్లు మంజూరు
సర్వే పూర్తి.. పనులు ప్రారంభం
మల్కాజిగిరి, డిసెంబర్ 26: అల్వాల్ సర్కిల్ పరిధిలో వరద ముంపురాకుండా అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నారు… ఇందులో భాగంగా అల్వాల్ మోతులకుంట చెరువు నుంచి కొత్త చెరువు మీదుగా చిన్నరాయుని చెరువు వరకు నాలా నిర్మాణం చేపట్టనున్నారు. 2.3 కిలో మీటర్ల పొడవు వరకు.. 40కాలనీల గుండా నాలాను నిర్మించనున్నారు. దీనికి మంత్రి కేటీఆర్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఎన్డీపీ) ద్వారా రూ.17.80కోట్లను మంజూరు చేశారు. దీంతో అధికారులు నాలాను నిర్మించడానికి మార్కింగ్ పనులు పూర్తిచేసి.. పనులు ప్రారంభించారు.
గతంలో వర్షం వచ్చిందంటే అల్వాల్ పరిధిలోని పలు కాలనీలు తర చూ వరదముంపునకు గురై.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.. ఈ ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే మైనం హన్మంతరావు నాలా నిర్మాణా నికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అధికారులు సర్వే చేసి 40కాలనీలను గుర్తించారు. మోతుల కుంట చెరువు నుంచి చిన్నరాయుడు చెరువు వరకు నాలాను విస్తరించడానికి సర్వే చేపట్టి.. నివేదికను ప్రభుత్వా నికి అందించారు. ప్రభుత్వం పరిశీలించి నాలా నిర్మాణానికి రూ.17.80కోట్లను మంజూరు చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం గా నాలాను పూర్తిస్థాయి లో విస్తరించనున్నారు.
కాలనీలకు శాశ్వత పరిష్కారం
అల్వాల్ సర్కిల్ పరిధిలో తరచూ వరదముంపునకుగురయ్యే 40కాల నీల శాశ్వత పరిష్కారానికి రూ.17.80కోట్లతో చెరువులను అనుసంధా నంచేస్తూ నాలా నిర్మాణ పనులు చేపట్టాం. నాలా నిర్మాణం జరుగుతున్న ప్పుడు స్థానికులు అధికారులకు సహకరించాలి. నాలా నిర్మాణం తర్వాత ప్రమాదాల నివారణకు నాలా వద్ద జాలీ ఏర్పాటు చేస్తాం. రానున్న రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే