హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాకు చెందిన రాములు(60), రషీద్(40) అనే ఇద్దరు గొర్రెలను తరలిస్తూ ఉండగా రాత్రి అవడంతో రోడ్డు పక్కన వారి వాహనం ఆపి నిద్రిస్తున్నారు.
ఈ సమయంలో వీరి వాహనాన్ని వెనుకనుండి గుర్తు తెలియని వామనం ఢీకొట్టి. పడుకున్న వారి మీద నుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.