మామిళ్లగూడెం, ఏప్రిల్ 19: ఖమ్మం లోక్సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం మరో నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటి రోజు గురువారం ఆదార్ పార్టీ నుంచి కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేయగా.. రెండో రోజు శుక్రవారం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తన నామపత్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్కు ఆర్వో కార్యాలయంలో అందజేశారు. మొత్తంగా ఖమ్మం స్థానానికి రెండో రోజుల్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
మహబూబాబాద్, ఏప్రిల్ 19 : మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు జిల్లా మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ రెండు సెట్లు దాఖలు చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, జాటోత్ రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీకాంత్రెడ్డి ఆయనతో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ, వరంగల్ రూరల్ నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన జాటోత్ రఘునాయక్ ఆధార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇటుకాలపల్లి ఏనుగులతండాకు చెందిన బోడ అనిల్నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ మహబూబాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్సింగ్కు అందించారు. మొదటి రోజు మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామ పంచాయతీ గుర్రపుతండాకు చెందిన బానోత్ లింగ్యా నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో మొత్తం ఐదుగురు నామినేషన్లను దాఖలు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ వెల్లడించారు.