న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మొదట బ్యాటింగ్కు దిగిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ వెంకటేశ్వర్ రావు (36 బంతుల్లో 85) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగులకు పరిమితమైంది. భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ), సమర్తనం ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీ లీగ్దశలో ఆంధ్రప్రదేశ్ అజేయంగా నిలువడం విశేషం.