మియాపూర్ : ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, సీఎం సహాయ నిధి ద్వారా భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 36 మంది బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 22.40 లక్షల ఆర్థిక సాయం చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవి, వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం వివేకానందనగర్లోని తన నివాసంలో లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వేలాది మంది పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదన్నారు. ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలు ఈ సహాయంతో కార్పొరేట్ వైద్యాలతో తమ ఆరోగ్యాలకు స్వస్థతను పొందారన్నారు. ఆపదలో అపన్నహస్తంలా బాధితులకు అండగా సీఎం సహాయ నిధి ఉపయుక్తమవుతుందని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్యాదవ్, జిల్లా గణేశ్,వాలా హరీష్, నాయినేని చంద్రకాంత్రావు, దామోదర్రెడ్డి, కొండల్రెడ్డి,కాశీనాథ్, రాజేందర్,సైదేశ్వర్రావు, ఆంజనేయులు పాల్గొన్నారు.