పోచమ్మమైదాన్, జనవరి 31: వరంగల్ నగరంలోని దేశాయిపేట శ్రీరంగనాయకస్వామి ఆలయ ప్రాంగణం లో సోమవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తూర్పు వైపు ఉన్న తవ్వకాలు చేపట్టారు. బండలు తొలగిస్తున్నప్పుడు రామానుజాచార్యులు, గోదాదేవి (అండాలమ్మ), గరుత్మంతుడు (ద్వారపాలకుడు) విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. దాదాపు 250 ఏండ్లనాటి విగ్రహాలుగా భావిస్తున్నట్టు పూజారి రంగాచార్యులు తెలిపారు.