న్యూఢిల్లీ : భారత సినీ రంగ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెపుతూ తెలుగు పాట ‘నాటు నాటు’ నవ్య చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ పాట ఆస్కార్ (oscars 2023) పురస్కారాన్ని అందుకుంది. నాటు నాటు పాటకు అరుదైన అవార్డు దక్కడంతో ప్రముఖులంతా దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Energy, optimism, partnership, winning against odds. #NaatuNaatu is not just a song: it’s a mini-epic movie. No wonder it had people everywhere rising to their feet. Even at the #Oscars I bow low to @ssrajamouli MM Keeravani & Chandrabose. 🙏🏽pic.twitter.com/6urWNclql5
— anand mahindra (@anandmahindra) March 13, 2023
రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కవులు, కళాకారులు, రచయితలు భారత్కు దక్కిన గౌరవాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇక నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు రావడంపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర స్పందించారు.
శక్తి, ఆశావాదం, భాగస్వామ్యం, అసమానతలపై విజయం..‘నాటు నాటు’ కేవలం పాట మాత్రమే కాదు..ఇది మినీ ఎపిక్ మూవీ. ఆస్కార్ వేదిక సహా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ కాలు కదపడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సహా చిత్ర బృందానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
Read More :
Oscars 2023 | వంద కోట్ల హృదయాలను గర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్.. రాజమౌళి బృందానికి అభినందనల వెల్లువ
Oscars 2023 | ఆస్కార్ వేడుకల్లో మెరిసిన ఎన్టీఆర్, రామ్ చరణ్