Oscars 2023 | అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరుగుతున్న ఆస్కార్ (Oscars) అవార్డులు-2023 ప్రధానోత్సవ వేడుకల్లో టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఇద్దరు నటులు బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ కార్పెట్ నడిచి తలుక్కున మెరిసిపోయారు.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana) కూడా వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనేతో కలిసి రామ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు.
ఇక దర్శకధీరుడు జక్కన రాజమౌళి (Rajamouli), ఆస్కార్ బరిలో నిలిచిన ‘నాటు నాటు’ (Natu Natu) పాట గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా వేడుకలకు హాజరయ్యారు.
Ramcharan 3
Ntr 4