కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయిన 100 మంది టీఎంసీ నేతల జాబితాను సువేందు అధికారి ఈ సందర్భంగా అమిత్ షాకు అందచేసినట్టు సమాచారం.
మరోవైపు టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో కోల్కతాలోని నాలుగు ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఈ స్కామ్లో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటారాగేషన్లో లభించిన పత్రాల ఆధారంగా ఫోర్ట్ ఒయాసిస్ హౌసింగ్ కాంప్లెక్స్లోని ఫ్లాట్పై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.
మరోవైపు తన నివాసంలో భారీగా పట్టుబడిన నగదు, బంగారు ఆభరణాలు, కీలక పత్రాలతో తనకు సంబంధం లేదని, తన పరోక్షంలో వీటిని తన ఫ్లాట్లో ఉంచారని అర్పితా ముఖర్జీ చెబుతుండగా పట్టుబడిన నగదు తనది కాదని పార్ధా ఛటర్జీ అంటున్నారు.