న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. అయితే సంబంధిత ఆహ్వానాలపై ఏండ్లుగా కొనసాగుతున్న ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’, ‘పీఎం ఆఫ్ ఇండియా’ బదులు ‘భారత్ రాష్టపతి’, ‘భారత్ ప్రధాని’ అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (Name Change Buzz) సెప్టెంబర్ 18 నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా దేశం పేరు మార్పు కోసం రాజ్యాంగాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భారత దేశం పేరు మార్పుపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది.
కాగా, దాయాది దేశమైన పాకిస్థాన్ మీడియా కూడా ఈ అంశంపై స్పందించింది. ‘ఇండియా’ అధికారికంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్థాయిలో తన పేరును ‘భారత్’గా మార్చుకున్నట్లయితే, ‘ఇండియా’ పేరును పాకిస్థాన్ దక్కించుకునే అవకాశమున్నదని ఆ దేశానికి చెందిన స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్లోని ఇండస్ ప్రాంతాన్ని సూచించే ‘ఇండియా’ పేరుపై హక్కు తమకే ఎక్కువగా ఉన్నదని పాకిస్థాన్ జాతీయులు ఎప్పటి నుంచో వాదిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. పాకిస్థాన్ స్థానిక మీడియా ఎక్స్లో ఈ మేరకు చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Just IN:— Pakistan may lay claim on name "India" if India derecongnises it officially at UN level. – local media
— Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰.
— South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023