వాషింగ్టన్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం నుంచి ప్రయాణ నిషేధాన్ని ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు విద్యార్థులు, మేధావులు, పాత్రికేయులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారతదేశం నుంచి ప్రయాణ నిషేధం నుంచి ఈ మూడు వర్గాల వారికి వర్తించదని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
మే 4 నుంచి భారతదేశంపై ప్రయాణ నిషేధాన్ని వైట్ హౌస్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ మాఫీ నోటీసు జారీ చేయడం విశేషం. విదేశాంగ మంత్రిత్వ శాఖ నోటీసు ప్రకారం, బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా నుంచి మినహాయింపు పొందిన ప్రయాణికులకు తోడుగా భారత ప్రయాణికులకు కూడా వర్తింపు ఉండనున్నది.
భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో మే 4 వ తేదీ నుంచి భారతదేశం నుండి వచ్చే వారిపై అమెరికా నిషేధం విధించింది. ఈ సమాచారాన్ని శుక్రవారం వైట్ హౌస్ ఇచ్చింది. ఇంతలో, రిపబ్లికన్ సభ్యులు జో బైడెన్ ప్రభుత్వం భారతదేశంపై ప్రయాణ నిషేధం విధించాడాన్ని తీవ్రంగా విమర్శించారు. తమ మిత్రదేశమైన భారత్పై ప్రయాణ నిషేధం విధించడం.. మెక్సికో సరిహద్దును తెరిచి ఉంచడం తార్కికం కాదని ఎంపీ టిమ్ బార్చెట్ ట్వీట్ చేశారు. మరో రిపబ్లికన్ ఎంపీ జోడ్ అరింగ్టన్ కూడా బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు.
కరోనా వ్యాప్తి వేళ టెలిమెడిసిన్ సేవలు.. ఎలా పొందొచ్చంటే..?
గవర్నర్తో మిథున్ చక్రవర్తి భేటీ.. రాష్ట్రమంతటా చర్చ
భారత్ బయట కోవిషీల్డ్ ఉత్పత్తికి సీరం సంస్థ యోచన
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..