కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ తూర్పు లోగర్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి జరిగిన భారీ కారు బాంబు పేలుడులో 30 మంది దుర్మరణం పాలయ్యారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా హైస్కూల్ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంతర్గత మంత్రి తెలిపారు. పేలుడు వెనుక ఎవరున్నారో వెంటనే స్పష్టంగా తెలియలేదు. తిరుగుబాటు చేసిన తాలిబాన్లు స్పందించలేదు.
రంజాన్ సందర్భంగా అతిథులు ఉపవాసం విరమించుకోవడానికి పలువురు లోగర్ ప్రావిన్స్లోని ఓ ఇల్లు గెస్ట్హౌస్గా వాడుతుంటారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గెస్ట్ హౌస్కు ఆనుకుని ఉన్న రోడ్డుపై నిలిపివుంచిన కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ధాటికి గెస్ట్హైస్ కుప్పకూలిపోయింది. దాంతో దాదాపు 30 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాదాపు 60 మంది వరకు గాయపడినట్లు తెలుస్తున్నది.
రెండు దశాబ్దాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెప్టెంబర్ 11 నాటికి సైనిక బలగాలను ఉపసంహరించుకునేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో హింస పెరిగింది. మునుపటి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కుదిరిన ఒప్పందం ప్రకారం మే 1 నాటికి బలగాలను ఉపసంహరించుకోవాలని తాలిబాన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి బాంబు దాడులు జరుగడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..