జెనీవా: కరోనా ఇన్ఫెక్షన్ చైనాలో వ్యాప్తి చెందక ముందే ల్యాబ్ నుంచి ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురైనట్లు నివేదించిన తర్వాత వైరస్ మూలాన్ని తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. వైరస్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకునేదుకు మళ్లీ దర్యాప్తు చేయాలని అమెరికా డిమాండ్ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంత్రివర్గ సమావేశంలో అమెరికా విద్యాశాఖ మంత్రి జేవియర్ బెకెరా మంగళవారం నాడు ఈ డిమాండ్ను లేవనెత్తారు. “కరోనా మూలాన్ని తెలుసుకోవడానికి పారదర్శక, శాస్త్రీయ ప్రాతిపదికన కొత్త అధ్యయనం జరుపాలి” అని వీడియో సందేశం ద్వారా తెలిపాడు. చైనా పేరు ఎత్తకుండా జేవియర్ ఈ డిమాండ్ చేశాడు.
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అనారోగ్యానికి గురయ్యారని రెండు రోజుల క్రితం అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక ఒక కథనంలో పేర్కొన్నది. నెల రోజుల తర్వాత చైనాలో మొదటి కరోనా కేసులు నిర్ధారించారు. దాంతో ఇదే ల్యాబ్ నుండి కరోనా వైరస్ లీక్ అయిందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.
గత సంవత్సరం అప్పటి ట్రంప్ ప్రభుత్వం కూడా చైనా ప్రయోగశాల నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని పేర్కొన్నది. అమెరికాతో పాలు పలు దేశాల డిమాండ్ మేరకు కరోనా మూలాన్ని వెతకడానికి డబ్ల్యూహెచ్ఓ బృందం గత జనవరిలో చైనా వెళ్లింది. ఈ బృందం వుహాన్ ల్యాబ్ను కూడా సందర్శించింది. అనంతరం కరోనా వైరస్ ఈ ల్యాబ్ నుంచి లీక్ అయిందన్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ ఖండించింది.
కనువిందు చేస్తున్న హిమాలయాలు
గాజాను పునర్నిర్మిస్తామని ఇజ్రాయెల్కు అమెరికా హామీ
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..