హైదరాబాద్, మార్చి 16: దేశంలో అతిపెద్ద విద్యుత్ వాహనాల తయారీ, విక్రయ సంస్థల్లో ఒకటైన అల్టిగ్రీన్..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా వరంగల్లో తొలి రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను నెలకొల్పింది. సంస్థకు ఇది 24వ అవుట్లెట్ కావడం విశేషం.
ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో అమితాబ్ శరణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వరంగల్లో తాజాగా అవుట్లెట్ను ప్రారంభించినట్లు, భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంస్థకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, రాంచీ, పాట్నాల్లో అవుట్లెట్లు ఉన్నాయి.