Pushpa The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్లో క్యూరియాసిటీని పెంచుతూ పుష్ప మేకర్స్.. ఫస్ట్ సింగిల్ను వదిలారు. ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు మొదటి పాటను రిలీజ్ చేశారు. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లే అనే లిరిక్స్తో సాగే ఈ పాట ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది.
పుష్పరాజ్ మేనరిజం ఎలా ఉంటుందో చక్కగా వివరిస్తూ ఈ పాటకు చంద్రబోస్ బాణీలు అందించారు. మొదటి పార్ట్కు సంగీతం అందించిన రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే సీక్వెల్లోనూ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. పాటలో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్ అంటూ వచ్చే బిట్ గూస్బంప్స్ తెప్పిస్తున్నది. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో అంతలా సక్సెస్ కావడానికి సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఫస్ట్ పార్ట్లో సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో సీక్వెల్లోని సాంగ్స్పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన సాంగ్ చూస్తుంటే.. పుష్ప 2 కూడా మ్యూజికల్గా బ్లాక్బస్టర్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. ఇందులో రష్మిక మంధన్నా కథానాయికగా నటిస్తోంది.