దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 8 నెలలుగా తాత్కాలిక సీఈవోగా కొనసాగుతున్న అలార్డిస్.. మను సాహ్నీ స్థానంలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసీస్ ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ అయిన అలార్డిస్ గతంలో ఐసీసీ జనరల్ మేనేజర్గా కూడా పని చేశాడు. ‘ఐసీసీ సీఈవోగా నియామకం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని ఈ సందర్భంగా అలార్డిస్ తెలిపాడు.