వరంగల్ : జిల్లాలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. రూ. 48,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్య పల్లె గ్రామానికి చెందిన రైతు పుల్లూరి మాధవరావు నలభై నాలుగు బస్తాల ద్వారా దేశి రకం మిర్చిని మార్కెట్ కు తెచ్చాడు.
ఇక్కడి అయ్యన్ ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ. 44,000 నిర్ణయించారు.
నిన్న దేశి రకం మిర్చికి పలికిన ధర రూ. 4,5000 బ్రేక్ చేసింది. సింగిల్ పట్టి రకం మిర్చికి కూడా ధర రికార్డు స్థాయిలో రూ. 45,000 పలికింది. కొద్దిరోజుల క్రితం సింగిల్ పట్టి రకం మిర్చి రికార్డు ధర రూ. 42,500. దేశి, సింగల్ పట్టీ రకాల మిర్చికి మార్కెట్ చరిత్రలో ఇవే అత్యధిక ధరలు. దేశి సింగల్ బట్టి రకాలకు మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికిన నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు. రికార్డు ధర పొందిన మిర్చి రైతులతో మాట్లాడారు.