జగిత్యాల : తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని, బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి ఎదిగిందని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కేసీఆర్ (CM CKR) మహోన్నత నాయకులని కొనియాడారు.
బీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి ఎల్ఓసీ అందజేత జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన చీర్నేని రామచంద్ర కుమార్తె చీర్నేని భూమిక నరాలవ్యాధితో బాధపడుతుంది. చికిత్స కోసం అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రూ. 3 లక్షల ఎల్ఓసీ చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు.