హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లలో తెలంగాణలో వ్యవసాయం గణనీయ వృద్ధిని సాధించిందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. 2014-15లో రూ.41,706 కోట్లు ఉన్న వ్యవసాయ ఆదాయం 2020-21 నాటికి రూ.80,574 కోట్లకు పెరిగింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం వరి సాగు 2014-15లో 14.15 లక్షల హెక్టార్లు ఉండగా, 2019-20 నాటికి 20.11 లక్షల హెక్టార్లకు చేరింది. పత్తి సాగు 2014-15లో 17.13 లక్షల హెక్టార్లు ఉండగా, 2019-20 నాటికి 21.27 లక్షల హెక్టార్లకు చేరింది. ఇక, ఎన్పీకే ఎరువుల వినియోగం తగ్గటం గమనార్హం. 2014-15లో హెక్టారుకు 231.4 కిలోల ఎరువులు వినియోగించగా, 2019-20 నాటికి 206.5 కిలోలకు తగ్గింది.