చండీగఢ్, మార్చి 28: దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాను కూడా తన కుమార్తె సీమతో కలిసి కమలం పార్టీలో చేరుతున్నట్టు గురువారం ప్రకటించారు.
10 ఏండ్లుగా ప్రాతినిధ్యం వహించిన హిసార్ నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్టు 84 ఏండ్ల సావిత్రి తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎంపీగా వ్యవహరించిన ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఆదివారం పార్టీని వీడి బీజేపీలో చేరి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.