గుడిహత్నూర్, ఫిబ్రవరి 15: శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనించాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని కొల్హారిలో మంగళవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మన్నూర్ ఎంపీటీసీ కెంద్రే న్యాను, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తుకారాం, శివాజీ, నాయకులు జలంధర్, తగరే ప్రకాశ్, ఫడ్ దిలీప్, లింగంపెల్లి రాజేశ్వర్,సిద్ధార్థ్ పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి 15: సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మండలంలోని రాజుల్గూడ,తాడిహత్నూర్ తండాల్లో సంప్రదాయ పూజలు చేసి బోగ్బండార్ నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్, జంగదాంబ దేవికి పూజలు చేశారు. తాడిహత్నూర్లో సేవాలాల్ పల్లకీ ఊరేగించారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న జయంతికి బంజారాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాజుల్గూడలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమం సర్పంచ్ రాథోడ్ సావీందర్, రాథోడ్ దిగంబర్, రాథోడ్ జైవంత్రావ్, శివాజీ పటేల్, బానోత్ దుల్సింగ్, రాథోడ్ దశరథ్, కైలాస్, గణేశ్, మర్సుకోల తిరుపతి, సుమన్బాయి, వసంత్రావ్, హరిదాస్, వినోద్కుమార్, రవీందర్ రాజు పాల్గొన్నారు.
బేల , ఫిబ్రవరి15 : సేవాలాల్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగురవేశారు. లంబాడాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ వీ ఇంద్రశేఖర్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, లంబాడా కులస్తులు రోహిదాస్, దినేశ్, సంతోష్, చరణ్సింగ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి15 : మండల కేంద్రంతో పాటు లంబాడీ తండాల్లో సేవాలాల్ మహారాజ్ జెండాలు ఎగురవేశారు. సేవాలాల్ చిత్రపటానికి ఫూలమాలు వేసి బోగ్బండార్ నిర్వహించారు. కార్యక్రమంలో బంజారా నాయకులు భరత్ చౌహాన్, రాథోడ్ మోహన్ నాయక్, ప్రేమ్సింగ్, అనిల్రాథోడ్, మంగీలాల్, రాంచందర్, సంజీవ్నాయక్, ఉత్తం, మనోజ్, గణేశ్, సంతోష్, దూద్రాం పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సాయినగర్ నుంచి మండల కేంద్రంలోని పలు వీధుల గుండా బంజారాలు ర్యాలీ నిర్వహించారు. రామారావు మహారాజ్ విగ్రహానికి పూజలు చేశారు. బోగ్బండార్ నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, కైలాస్ టేకిడి ఆలయ వ్యవస్థాపకుడు సంత్ లింబాజీ మహారాజ్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ సురేందర్ యాదవ్, బంజారా సేవా సమితి నాయకులు లింబాజీ, నానులాల్, సుభాష్నాయక్, ఎంపీడీవో రాథోడ్ రాధ పాల్గొన్నారు.
భీంపూర్,ఫిబ్రవరి 15: భీంపూర్లోని సేవాలాల్ ఆలయంలో విశేష పూజలు చేశారు. బంజారా మహిళలు కళశాలతో శోభాయాత్ర నిర్వహించారు. యువకులు సంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు గ్రామ సమితి అధ్యక్షుడు ఉత్తం రాథోడ్, మహేశ్ నాయక్, తారాచంద్, భవానీ మహారాజ్, ధరంసింగ్, బంజారాలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 15: పాత ఉట్నూర్లోని రాంనగర్లో ఘనంగా సేవాలాల్ చిత్ర పటానికి పూలమాలు వేశారు. బోగ్ భండార్ పూజలు చేశారు. ఏందా ప్రభుత్వ పాఠశాలలో సేవాలాల్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో గాయకులు బంకట్లాల్, రాథోడ్ ప్రేమ్సింగ్, ఉపాధ్యాయుడు దిలేశ్ చౌహాన్ పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 15 : సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో మంగళవారం నిర్వహించారు. మొదటి రోజు భోగ్ భండార్ నిర్వహించారు. కార్యక్రమంలో కుల పెద్దలు రాథోడ్ హీరాలాల్ నాయక్, రాథోడ్ సురేశ్ నాయక్, రూపావత్ అమర్ సింగ్, బలిరాం జాదవ్, రెడ్డినాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ రామారావ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పవార్, క్రాంతి కుమార్, చౌహాన్ వినాయకరావు, సుభాష్, పవార్ శంకర్, అర్జున్ పవార్, బానోత్ రవీందర్ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మండల కేంద్రంతో పాటు రాజురా, బోరిగాంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల నేతలు, నాయకులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. బోగ్బండార్ నిర్వహించారు. రాజురాలోని జగదాంబదేవి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు జాదవ్ వసంత్, ఆడె నూర్సింగ్, బాబులాల్, ఆడె వసంత్, రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిరికొండ, ఫిబ్రవరి15: ధర్మసాగర్, వాయిపేట్, చెమ్మాన్గూడ, సుంకిడి గ్రామాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలు వేసి పూజలు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు లక్ష్మి, జాదవ్ అనిత, గ్రామపెద్దలు ధరమ్ సింగ్, తుకారాం, భిక్కు, ఆనంద్రావ్, దినేశ్, కిషన్ పాల్గొన్నారు.