నిర్మల్ అర్బన్, జూలై 1 : వచ్చే ఏడాది పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని సెక్టోరియల్ అధికారి శ్రీదేవి అన్నారు. పది ఫలితాల్లో జిల్లాను ద్వితీయ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తూ, అందరిని సమన్వయ పరిచిన డీఈవో రవీందర్ రెడ్డినినిర్మల్లోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సన్మానించారు.
ప్రస్తుతం 13 కేజీబీవీల్లో 100 ఉత్తీర్ణత సాధించగా, రానున్న రోజుల్లో అన్ని కస్తూర్బా విద్యాలయాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో పాటు 10/10 జీపీఏ తీసుకువచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం వందశాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీ ఎస్వోలను సత్కరించారు. ఎస్వోలు నవిత, సుజాత ఉన్నారు.
దస్తురాబాద్,జూలై 1 : పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన దస్తురాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆకుల ఈశ్వర్, కేజీబీవీ ఎస్వో వీణను జిల్లా కేంద్రంలో డీఈవో రవీందర్రెడ్డి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.