నార్నూర్,జూలై1: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. జొన్నల కొనుగోలులో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్కు సూచించారు.అనంతరం మండల కేంద్రంలో రూ.5లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్పీ నిధుల్లో నార్నూర్ పంచాయతీకి రూ.14లక్షలు కేటాయించిన్నట్లు తెలిపారు. అంతకుముందు స్థానిక సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో మరమ్మతులు చేపట్టిన గదులను ప్రారంభించారు. విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగులు, షూలు, చద్దర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్,ఖైరద ట్వా సర్పంచ్ కనక సేవంతా ప్రభాకర్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, వార్డెన్ రవి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నప్పరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.