బోథ్, జూలై 1: వైద్య వృత్తి ఎంతో గొప్పదని బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవీంద్రప్రసాద్, సొనాల పీహెచ్సీ డాక్టర్లు కే నవీన్రెడ్డి, కేదర్నాథ్ను శాలువాలతో సన్మానించారు. అలాగే నాగభూషణం, వేదం పాఠశాలల విద్యార్థులు డాక్టర్లతో పాటు ఆర్ఎంపీలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వైద్యులు సేవలు మరువలేనివి
ఇచ్చోడ, జూలై 1: వైద్యుల సేవలు మరువలేనివని ఉపసర్పంచ్ లోక శిరీశ్రెడ్డి అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా మండల కేంద్రంలోని దవాఖానలో వైద్యాధికారి ఆకుదారి సాగర్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, నాయకులు అశోక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.