ఉట్నూర్ రూరల్, జూన్ 27: పీహెచ్సీలో సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. దంతన్పల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అధ్యక్షతన సోమవారం దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలు సమీక్షించారు. 2022-23 సంవత్సరానికి గాను దవాఖానలో ల్యాబ్ పరికరాలు, మందుల కొనుగోలు, రోగులకు తాగునీటి సౌకర్యం, పరిసరాల శుభ్రత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్, వైద్యురాలు అనురాధ, సర్పంచ్ భూమన్న, ఎంపీటీసీలు ఆత్రం లచ్చు, అనసూయ పాల్గొన్నారు.