ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 25 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్, భాగ్యనగర్, గాంధీనగర్లో శుక్రవారం 35 మంది లబ్ధిదారులకు ఇంటింటీకీ వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మహిళా కార్యదర్శి మమత, కౌన్సిలర్ నర్సింగ్, నాయకులు పందిరి భూమన్న, గణేశ్, సంజయ్, సలీమ్, గోలి శంకర్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 25 : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు వడగాం, ముత్నూర్, ధనోరా(బీ) గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. 66 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఐకేపీ ద్వారా రూ.500 డీడీ కట్టిన మహిళలకు మంజూరైన సోలార్, రిమోట్ కంట్రోల్ ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, సర్పంచ్లు కోరెంగా గాంధారి, రాథోడ్ శారద, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, రాజేశ్వర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు హరిదాస్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, నాయకులు మారుతి, కనక హనుమంత్రావ్, బాబుముండే, సుంకట్రావ్, రాథోడ్ వసంత్రావ్, ఆత్రం మారుతిపటేల్, నగేశ్, నవాబ్బేగ్, ఐకేపీ ఏపీఎం రాథోడ్ రామారావ్, ఆర్ఐ అరుణ్, సిబ్బంది ఉపేందర్, మల్లేశ్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలోటీఆర్ఎస్ మండల కన్వీనర్ బాలాజీ, ఉపాధ్యక్షుడు సునీల్, నాయకులు బషీర్, అశోక్, శంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.