బంగారు తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహరిశ్నలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేశ్, మాజీ జడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్దేవ్, జీవవైవిధ్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, టౌన్ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, నాయకులు సుమన్బాయి, రంజనాబాయి, హైమద్,షేక్ దాదేఅల్లీ, కొరల మహేందర్, లొకండే చంద్రశేఖర్, మెస్రం మానిక్రావ్, కనక ప్రభాకర్, మడావి సాగర్, ఫడ్ విష్ణు, మడావి రూప్దేవ్, ఆడా శ్రీరామ్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్ దేవన్న, నాయకులు దిలీప్, గంగన్న, ఎల్టీ వెంకట్రెడ్డి, సాయినాథ్, నర్సింగ్, లస్మన్న పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బోథ్లో నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డిక్షనరీలను ఎంపీపీ తుల శ్రీనివాస్ మంగళవారం అందించారు. కార్యక్రమంలో బోథ్ పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బోథ్లోని ప్రభుత్వ దవాఖానలోని రోగులకు టీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, చట్ల ఉమేశ్, కే వెంకటరమణాగౌడ్, డీ నారాయణరెడ్డి, సీ సదానందం, అల్లకొండ ప్రశాంత్, సోలంకి సత్యనారాయణ, ఎలుక రాజు, సంజీవ్రెడ్డి, భీమ బుచ్చన్న, బీరం రవీందర్, ద్యాగల గంగయ్య, చిలుకూరి నరేందర్, మెడిచెల్మ ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇచ్చోడలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ డుకురే సుభాష్ పాటిల్, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, సోన్పల్లి ఎంపీటీసీ చౌహాన్ సూర్యకాంత్, నాయకులు దాసరి భాస్కర్, వెంకటేశ్, ఆర్గుల గణేశ్, ప్రవీణ్, గైక్వాడ్ గణేశ్, బలగం రవి, రామేశ్వర్, పాన్పట్టే సుభాష్, లతీఫ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు లింగంపెల్లి రాజేశ్వర్, ప్రతాప్ రాథోడ్, ఫడ్ దిలీప్, డాక్టర్ నిలోఫర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్ ఆధ్వర్యం లో పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ సామ ప్రభాకర్రెడ్డి, నాయకులు దాసండ్ల ప్రభాకర్, ధరణి రాజేశ్, పోషన్న, రాజ్కుమార్, ఆశన్న, మనోహర్, సతీశ్, సత్యన్న, భూమన్న, కార్యకర్తలు ఉన్నారు.
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి పీహెచ్సీలో రోగులకు మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, జాదవ్ స్వర్ణలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఉపసర్పంచ్ గణేశ్ టెహెరే, టీఆర్ఎస్ నాయకులు దేవ్పూజె మారుతి, బాబుముండే, పోటే సాయినాథ్, కనక హనుమంత్రావ్, షేక్ సూఫియాన్, మెస్రం తుకారాం, మహేశ్ కదం, సుంకట్రావ్, నగేశ్, రాం నివాస్ పాల్గొన్నారు.
ఎంపీపీ రాథోడ్ సజన్ ఆధ్వర్యంలో దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ ఏలేటి మహేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, కుమారి సర్పంచ్ రాజు యాదవ్, నాయకులు చంద్రశేఖర్యాదవ్, మద్దెల నారాయణ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం మాలెబోరిగాంలో ఎంపీటీసీ కుమ్ర జంగుబాపు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి రాజు, గ్రామస్తులు రాము పటేల్, మహాజన్ నాందేవ్, భూమన్న, సీతారాం పాల్గొన్నారు.