చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పెద్ద రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రముఖ నటుడు అజిత్కుమార్ భార్యత షాలినితో కలిసి తిరువాన్మియూర్లోని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్లో బారులు తీరారు. అంతకు ముందు అజిత్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో అజిత్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ అభిమాని ఫోన్ను లాక్కున్నాడు. ఫోన్ను వ్యక్తిగత సిబ్బందికి అందజేశాడు. ఎంత సేపటికి ఫోన్ను తిరిగి ఇవ్వలేదు.
మరో వైపు ఇళయపతి విజయ్ సైకిల్పై వచ్చి ఓటు వేశారు. చెన్నైలోని నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో ఓటు వేశారు. అభిమాన హీరో రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అలాగే పెరియాకుళంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తన తల్లితో కలిసి వచ్చి ఓటు వేశారు. అన్నానగర్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్, శివగంగ జిల్లా కందనూర్లో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం ఓటుహక్కును వినియోగించుకున్నారు.