అమరావతి: ఆర్థిక శక్తి ఉంటేనే ఆత్మవిశ్వాసం వస్తుందని, యువత ఇతరుల ఆర్థిక సహాయం పై ఆధారపడకుండా తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూర్ మండలం స్వర్ణభారత్ ట్రస్ట్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినపుడే దేశాభివృద్ధి సాధ్యమని, యువకులు పల్లెల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని సూచించారు. మనం చేసే సహాయం ఉపాధిని అందించి కష్టపదే విధంగా ఉండాలే తప్పా సోమరులుగా మార్చే విధంగా ఉండవద్దని అన్నారు.
ఉచితం ఎంతవరకు సముచితమని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. యువత నైపుణ్యాభివృద్ధిని మెరుగు పరుచుకోవాలన్నారు.