తిరుమల, జూలై: తిరుమలలో గదులు పొందే భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు,సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించేందుకు టిటిడి సిద్ధమైంది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వేలాది గదులు ఉన్నాయి.
ఆయా ప్రాంతాల్లో గదులు పొందిన యాత్రికులు ఫర్నీచర్, పరుపులు, కొళాయిలు, పరిశుభ్రత, లైట్లు తదితర సమస్యలను తెలిపేందుకు వీలుగా ప్రత్యేకంగా సెల్ నంబరు ఏర్పాటు చేయనున్నారు. ఈ నంబరుతో పాటు అవసరమైన ఇతర సమాచారాన్ని అన్ని గదుల్లో స్టిక్కర్ల ద్వారా యాత్రికులకు తెలియచేస్తారు. గదుల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగపడనున్నది.