హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని నాగోల్లో లంచం తీసుకుంటూ విద్యుత్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. టీఎస్ ఎస్పీడీసీఎల్ ఏఈ మధుకర్.. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పనులు పూర్తయినట్లు నివేదిక ఇవ్వడానికి లంచం అడగడంతో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో బుధవారం డబ్బులు తీసుకుంటుండగా ఏఈ మధుకర్ను పట్టుకున్నారు.