రాంనగర్, మార్చి 28: కరీంనగర్లో గురువారం దారుణం జరిగింది. ఓ గృహిణి భర్తను తాళ్లతో కట్టి కారంపొడి, వేడి నీళ్లు ఒంటిపై పోసి రోకలి బండతో బాది దారుణంగా హతమార్చింది. కన్నతల్లి ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన తోట హేమంత్కు రోహితితో 2012లో వివాహం జరిగింది. హేమంత్ (39) పెట్రోల్ బంక్లో పనిచేసి కొంతకాలం క్రితం మానేశాడు. రోహితి ప్రభుత్వ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్గా పనిచేస్తున్నది. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
గురువారం రోహిణి ఓ ఇద్దరితో కలిసి ఇంటికి వచ్చింది. తలుపులు పెట్టి హేమంత్ను ఇంట్లో తాళ్ల తో కట్టేశారు. కారం పొడి పోసి చితకబాదారు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు వెళ్లిపోగా రోహితి వేడి నీళ్లు ఒంటిపై పోసి రోకలి బండతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మర్మాంగంపై గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికి త్స కోసం అంబులెన్సులో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.