అమరావతి : అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్లపైకి వస్తుండడంతో గ్రామస్థులు, బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు సందడి చేశాయి. విపరీతమైన మంచి కురుస్తుండగా గజరాజులు రోడ్డుపైకి వచ్చాయి.
అనంతరం ఏనుగుల గుంపు గ్రామాల వైపు వస్తుందేమోనని అరుపులతో అటవీ మార్గంలోకి తరిమారు. ఓ మదఫుటేనుగు ఘింకరిస్తూ గ్రామస్తులను వెంబడించడంతో గ్రామస్థులు పరుగులు తీశారు. ఏనుగులు 30 నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరిగాయి. ఇరువైపుల నుంచి వచ్చే వాహనదారులు ఏనుగులను చూసి దూరంలోనే నిలిచిపోయారు.
అరగంట అనంతరం ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో గ్రామస్థులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల వైపు ఏనుగులు రాకుండా అటవి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.