వరంగల్ : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.
జనగామ కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) ఉద్యోగి రావుల రవి గురువారం వరంగల్ సమీపంలోని ధర్మారం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఆయన గత కొంత కాలంగా జనగామ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.