ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవుడ్ చిత్రాలు తమ విఎఫ్ఎక్స్ యానిమేషన్ను భారతదేశంలో పూర్తి చేసుకుంటున్నాయని,చలనచిత్ర రంగంలో భారతదేశ పాత్ర పెరుగుతున్నదని జవదేకర్ అన్నారు.
భారతదేశం అత్యుతమ సృజనాత్మకత,ప్రతిభ,సాంకేతికతతో కూడిన వ్యాపార అవకాశాలను అందిస్తున్నదని మంత్రి జవదేకర్ అన్నారు. దేశంలో అనేక అంతర్జాతీయ చిత్రాల నిర్మాణం సాగుతున్నదని ఆయన అన్నారు. సినిమాలను చిత్రీకరించడానికి భారతదేశంలో 500 కి పైగా అనువైన ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని చిత్రాలను భారతదేశంలో నిర్మించేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని పేర్కొన్నారు.