Kagaznagar | కాగజ్నగర్, ఏప్రిల్ 15: బిల్లులు చెల్లించడం లేదంటూ ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు గంటపాటు గేటు బయట వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని పెట్రోల్బంకు సమీపంలోగల జడ్పీ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’లో రూ.1.28 కోట్లతో నూత న భవనాలు నిర్మించారు. సదరు కాంట్రాక్టర్ పనులన్నీ పూర్తిచేశాడు. రూ.97 లక్షల బిల్లులు రావా ల్సి ఉంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో పాఠశాల గేటుకు తాళం వేశాడు.