డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ శైలజా భట్ తెలిపారు. యాత్రికుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారని, యాత్ర రూట్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు భట్ వెల్లడించారు. మొత్తం 169 మంది డాక్టర్లు విధుల్లో ఉన్నట్లు చెప్పారు.