తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకోగా 32,894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చిందని వివరించారు.
కాగా ఎల్లుడి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈనెల 9న శ్రీవారి పాదాలకు చత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.