ఎథెన్స్, జూన్ 14: గ్రీస్ దేశంలో భారీ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్నపాటి నౌకలాంటిది) నీట మునగడంతో దాదాపు 78 మంది మరణించారు. డజన్ల కొద్ది జనం తప్పిపోయారు. దక్షిణ గ్రీస్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
చేపల వేట కోసం వెళ్తున్న పడవలో సామర్థ్యానికి మించి వలసదారులు ఎక్కారు. అయితే ఈ పడవ కొద్దిదూరం ప్రయాణించాక అదుపుతప్పి నీట మునిగిపోయింది. దీంతో 78 మంది ప్రాణాలుకోల్పోయారు. 104 మందిని రక్షించారు. తప్పిపోయినవారిని కాపాడటానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.