టోక్యో : ఈశాన్య జపాన్లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. ప్రాథమిక నష్టతీవ్రత సమాచారం తెలియాల్సి ఉందని విపత్త నిర్వహణ అధికారులు తెలిపారు. మియాగి ప్రాంతానికి చెందిన పసిఫిక్ జలాల్లో 60 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. మీటరు ఎత్తులో సునామీ తరంగాలు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు జేఎంఏ తెలిపింది. స్థానిక అణు కర్మాగారాల తీరును పరిశీలించారు. అదేవిధంగా స్థానిక రైల్వేతో సహా బుల్లెట్ రైళ్ల సేవలను నిలిపివేశారు. సునామీ సలహాల జారీ నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం నాటి భయంకర అనుభవాలను గుర్తెరిగిన తీరప్రాంతవాసులు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లారు.