హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ర్టానికి చెందిన ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచూరీ మ్యాట్రసెస్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. దేశవ్యాప్తంగా తన ఉత్పత్తులను ఎక్స్క్లూజివ్గా విక్రయించడానికి 400 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ..వచ్చే రెండేండ్లలో మరో 600 ఎక్స్క్లూజివ్ స్టోర్లను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో 150 ఎక్స్క్లూజివ్ స్టోర్లు ఉన్నాయని, వచ్చే రెండేండలో మరో 100 స్టోర్లను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఎంతమేర పెట్టుబడులు పెట్టేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో మూడు ప్లాంట్లు ఉండగా, ఒడిశాలో రెండు యూనిట్లు ఉన్నాయి. రూ.12 వేల కోట్ల స్థాయిలో ఉన్న పరుపుల మార్కెట్లో మెజార్టీ వాటా అసంఘటిత రంగానిదేనని, అలాగే ఏపీ, తెలంగాణలో రూ.1,000 కోట్లుగా ఉన్న మార్కెట్లో సంస్థ 20 శాతం వాటా కలిగి వున్నామని అన్నారు. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 20 శాతంగా ఉన్నదన్నారు.